ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టిన రియాద్ విమానాశ్రయం..!
- August 23, 2024
రియాద్: రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KKIA) జులై చివరి, ఆగస్టు 2024 ప్రారంభంలో దాని అత్యధిక ప్రయాణీకుల ట్రాఫిక్ రికార్డ్ను బద్దలుకొట్టింది. జూలై 2024లో విమానాశ్రయం 3.5 మిలియన్ల ప్రయాణీకులను హ్యాండిల్ చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది జూన్లో 3.1 మిలియన్ల ప్రయాణీకుల గత రికార్డును అధిగమించింది. నివేదిక ప్రకారం.. జూలై 25న 125,000, జూన్ 13న 124,000 మంది ప్రయాణీకుల మునుపటి గరిష్టాలను అధిగమించి, 130,000 మంది ప్రయాణికులతో, ఆగస్ట్ 1, 2024న నాడు విమానాశ్రయం కొత్త సింగిల్-డే రికార్డును నెలకొల్పింది. జూలైలో, విమానాశ్రయం సీటు ఆక్యుపెన్సీ(91 శాతం)ని సాధించింది. రేటు, దాని అధిక కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందనీ రియాద్ ఎయిర్పోర్ట్స్ కంపెనీ సీఈఓ అయ్మన్ అబోఅబహ్ తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







