దుబాయ్ మెట్రో సమయాలను పొడిగించిన RTA
- August 23, 2024
యూఏఈ: దుబాయ్ మెట్రో పని వేళలను వారాంతంలో పొడిగించినట్లు రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) తెలిపింది. ఆగస్ట్ 24 వరకు ఉదయం 5 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు.. ఆగస్టు 25 ఆదివారం ఉదయం 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆపరేటింగ్ వేళలు ఉంటాయని అధికార యంత్రాంగం తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ (DXB) నివాసితులు వేసవి సెలవుల నుండి తిరిగి వచ్చినందున, రాబోయే 13 రోజుల్లో 3.43 మిలియన్ల మంది అతిథులను హ్యాండిల్ చేస్తామని చెప్పారు.
ఆగస్ట్ 31, సెప్టెంబరు 1 మధ్యకాలంలో అర మిలియన్ కంటే ఎక్కువ మంది అతిథులను నిర్వహిస్తామని దుబాయ్ ఎయిర్పోర్ట్స్ తెలిపింది. సెప్టెంబర్ 1న అత్యంత రద్దీగా ఉండే రోజుగా తెలిపింది. DXB 291,000 మంది అతిథులకు వసతి కల్పిస్తుంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దుబాయ్ రికార్డు స్థాయిలో 44.9 మిలియన్ల అతిథులను స్వాగతించింది.
తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









