నేపాల్లో పడిన బస్సు…14 మంది భారతీయులు మృతి
- August 23, 2024
కాట్మండు: నేపాల్లో భారతీయ పర్యటకులతో ప్రయాణిస్తున్న బస్సు నదిలోకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో 14 మంది మృతిచెందగా.. పలువురు గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. మరికొందరు నదిలో గల్లంతయ్యారు. తనాహున్ జిల్లాలో కొండల ప్రాంతంలో అదుపు తప్పి మర్స్యాంగ్డి నదిలో బస్సు పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా భారతీయులే. ఉత్తరప్రదేశ్ నెంబర్ ప్లేట్ తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సు శుక్రవారం ఉదయం నేపాల్ లోని పొఖారా నుంచి కాఠ్ మాండూ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, 14మంది మృతదేహాలను వెలికితీయగా.. 16మంది ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బస్సు ప్రమాదం సమయంలో 40 మంది ఉండగా.. మరో పది మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ స్పందించారు. స్థానిక అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









