సలాలాలో ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభం
- August 24, 2024
మస్కట్: సలాలాలోని విలాయత్లో హెరిటేజ్, టూరిజం మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్, ధోఫర్ ఖరీఫ్ సీజన్ 2024తో కలిసి ప్రారంభమైంది. ఆగస్టు 26 వరకు జరిగే ఈ ఫెస్టివల్లో అనేక మంది ఒమానీ, గల్ఫ్ చెఫ్ల ప్రత్యక్ష ప్రదర్శనలతో సహా వివిధ కార్యకలాపాలు ఉన్నాయి. అనేక లిటిల్ చెఫ్ కార్నర్, సాంప్రదాయ సంగీత జానపద ప్రదర్శనలు, వివిధ పోటీలు నిర్వహించనున్నారు. సాంప్రదాయ ఒమానీ ఆహారాలను అందించే రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు.
ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్ ఫోరమ్లు, ఫెస్టివల్స్, ఈవెంట్ల ద్వారా స్థానికంగా, ప్రాంతీయంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ టూరిజంను ప్రోత్సహించడం ముఖ్యంగా ఒమానీ పాక కళలు, ఒమానీ వంటకాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమ ఉద్దేశం అని నిర్వాహకులు ప్రకటించారు. ఫెస్టివల్ ప్రారంభ వేడుకను ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ ఫైసల్ బిన్ అబ్దుల్లా అల్ రావాస్ స్పాన్సర్ చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









