బహ్రెయిన్లో 'మెడిసిన్ కొరత'పై నిపుణులు ఏమన్నారంటే?
- August 26, 2024
మనామా: బహ్రెయిన్ లో కొనసాగుతున్న మెడిసిన కొరత కారణాలను ఫార్మసీ ఓనర్స్ హెడ్ డాక్టర్ ఖలీద్ అల్ అవధి వివరించారు. మెడిసిన్ పేటెంట్ ముగిసిన సమయంలో, చౌకైన సాధారణ ప్రత్యామ్నాయాలు మార్కెట్ లోకి వస్తాయన్నారు. కొన్నిసార్లు అసలు కంటే ఎనిమిది రెట్లు తక్కువ ఖర్చు తో ఇవి ఉంటాయన్నారు. దాంతో ధరలను తగ్గినప్పటికీ, కంపెనీలు ఉత్పత్తి తగ్గించడంతో బహ్రెయిన్ లో మెడిసిన్ కొరత ఏర్పడిందన్నారు. నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. బహ్రెయిన్ మార్కెట్లోకి ప్రవేశించకుండా జెనరిక్స్ను అడ్డుకోవడంలో సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. త్వరలో రాబోయే జాతీయ ఆరోగ్య బీమా కార్యక్రమం పరిస్థితిని సులభతరం చేయగలదని డాక్టర్ అల్ అవధి తెలిపారు. గత త్రైమాసికంలో ధరల సవరణలు లేకపోవడం వల్ల కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీలకు మార్కెట్ను భరించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.దిగుమతి నిబంధనలు సడలించినప్పటికీ, లాభదాయకత ప్రధాన అడ్డంకిగా ఉందని ఆయన అంగీకరించారు. గ్లోబల్ ఎకానమీ నుండి వచ్చే ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా, కంపెనీలు తమ ధరలు ఆమోదయోగ్యమైన మార్జిన్ను మించి ఉంటే తరచుగా తిరస్కరణను ఎదుర్కొంటాయని వివరించారు. ప్రతి స్టాక్ కీపింగ్ యూనిట్ (SKU)ని నమోదు చేసుకోవడానికి 500 దినార్ల అవసరం, ఇది ఔషధ కంపెనీలపై మరింత ఆర్థిక ఒత్తిడిని పెంచుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు