ఒమన్ లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి..!
- August 26, 2024
మస్కట్: వచ్చే వారం పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత స్కూల్ బస్సులను నియంత్రించే కఠినమైన నిబంధనలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు.2024/2025 కొత్త విద్యా సంవత్సరానికి సన్నాహకంగా, పాఠశాల విద్యార్థుల రవాణా అనేది విద్యా మంత్రిత్వ శాఖ అత్యంత ప్రాధాన్యతగా ఉందన్నారు. కాంట్రాక్టులను పునరుద్ధరించడం, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా కొత్త రవాణాను అందించడం, రహదారి భద్రతపై డ్రైవర్లు , విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలను అమలు చేయడంతో సహా పాఠశాల రవాణా నాణ్యత మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రాథమిక విధానాలపై దృష్టి సారించినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రస్తుత పాఠశాల రవాణా మార్గాలను పరిశీలించడానికి కమిటీలను ఏర్పాటు చేసినట్టు, 20,000 కంటే ఎక్కువ పాఠశాల బస్సుల కోసం ఒప్పందాలను పునరుద్ధరించిందని ప్రాజెక్ట్స్ అండ్ సర్వీసెస్ డైరెక్టరేట్-జనరల్ డైరెక్టర్ జనరల్ ఖమీస్ అల్-హదీది వివరించారు. రానున్న ఐదేళ్లలో మొత్తం 5,000 పాఠశాల రవాణా వాహనాలు వస్తాయని,2024/2025 విద్యా సంవత్సరంలో 1,000 వాహనాలు తీసుకురానున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









