ఆ వార్తలు అబద్దం…లడ్డూ ప్రసాదం విక్రయాలలో మార్పులు లేవు: టిటిడి
- August 30, 2024
తిరుమల: ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి నెల రోజుల తర్వాతే మళ్లీ లడ్డూలను తీసుకునేందుకు అవకాశం ఉంటుందని.. దళారులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేరుతో వచ్చిన వార్త పై టిటిడి దీని పై వివరణ ఇచ్చింది. తిరుమలలో లడ్డూ విక్రయ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూల వరకు విక్రయిస్తామని చెప్పింది. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని క్లారిటీ ఇచ్చింది. నెలకు ఒకసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదని.. అదనపు లడ్డూలను ప్రతిరోజూ తీసుకోవచ్చని తెలిపింది.
టికెట్స్, టోకెన్స్ లేకుండానే కొంతమంది లడ్డూలను కొనుగోలు చేస్తున్నారని.. వాటిని బయట బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందుకే టోకెన్లు లేని వారికి ఆధార్ నిబంధన పెట్టామని చెప్పారు. దళారీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







