ఆ వార్తలు అబద్దం…లడ్డూ ప్రసాదం విక్రయాలలో మార్పులు లేవు: టిటిడి
- August 30, 2024
తిరుమల: ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి నెల రోజుల తర్వాతే మళ్లీ లడ్డూలను తీసుకునేందుకు అవకాశం ఉంటుందని.. దళారులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేరుతో వచ్చిన వార్త పై టిటిడి దీని పై వివరణ ఇచ్చింది. తిరుమలలో లడ్డూ విక్రయ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూల వరకు విక్రయిస్తామని చెప్పింది. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని క్లారిటీ ఇచ్చింది. నెలకు ఒకసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదని.. అదనపు లడ్డూలను ప్రతిరోజూ తీసుకోవచ్చని తెలిపింది.
టికెట్స్, టోకెన్స్ లేకుండానే కొంతమంది లడ్డూలను కొనుగోలు చేస్తున్నారని.. వాటిని బయట బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందుకే టోకెన్లు లేని వారికి ఆధార్ నిబంధన పెట్టామని చెప్పారు. దళారీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







