1,820 తనిఖీలు..150మందిపై బహిష్కరణ వేటు.. LMRA
- September 03, 2024
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) తనిఖీలన ముమ్మరం చేసింది. ఆగస్టు 25 నుండి 31 వరకు 1,820 తనిఖీ క్యాంపెయిన్ లను నిర్వహించింది. ఈ సందర్భంగా రెసిడెన్సీ చట్టాల నిబంధనలు ఉల్లంఘించిన 48 మందిని అదుపులోకి తీసుకోగా.. 150 మందిపై బహిష్కరణ వేటు వేశారు. అన్ని గవర్నరేట్లలోని వివిధ దుకాణాలపై 1,808 తనిఖీలు చేసినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. జాతీయత, పాస్పోర్ట్లు మరియు నివాస వ్యవహారాలు (NPRA), మరియు గవర్నరేట్ సంబంధిత పోలీసు డైరెక్టరేట్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ వెర్డిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ సెంటెన్సింగ్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ ద్వారా ప్రాతినిధ్యం వహించే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సహ పలు మంత్రిత్వ శాఖలు తనిఖీలలో పాల్గొన్నట్లు తెలిపింది. అధికార వెబ్సైట్ http://www.lmra.gov.bhలో ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా అధికారానికి కాల్ చేయడం ద్వారా చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను తెలిపి మద్దతు ఇవ్వాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ పిలుపునిచ్చింది. 17506055 లేదా ప్రభుత్వ సూచనలు, ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా కాల్ సెంటర్ కు తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









