బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్ గా అజయ్ రాత్రా..

- September 03, 2024 , by Maagulf
బీసీసీఐ కొత్త సెలెక్ట‌ర్ గా అజయ్ రాత్రా..

ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కొత్త సెలక్టర్‌ను నియమించింది. ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్ ఆడిన భార‌త జ‌ట్టు కోచింగ్ బృంద‌లో స‌భ్యుడైన అజయ్ రాత్రాను…. కొత్త సెలెక్టర్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెలెక్టన్ ప్యానెల్ సభ్యులలో ఒకరైన సలీల్ అంకోలా స్థానంలో అజయ్ నియమితులు కానున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం వెల్లడించింది.

చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని టీమ్‌తో అజయ్ పని చేయ‌నున్నాడు. ఐదుగురు సభ్యుల ప్యానెల్‌కు అజయ్ గురువారం నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com