రండి.. వరద బాధితులను ఆదుకుందాం..NATS పిలుపు
- September 03, 2024
అమెరికా: తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించిన వరదలు లక్షల మంది జీవితాలను ముంచేశాయి. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచేందుకు మానవత్వంతో స్పందించి ముందుకు రావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ పిలుపునిచ్చింది. విజయవాడ, ఖమ్మం, నల్గొండ, గుంటూరు తదితర ప్రాంతాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు చేతనైన సాయం చేసేందుకు అమెరికాలో ఉండే ప్రతి ఒక్క తెలుగు కుటుంబం స్పందించాలని కోరింది. సాటి తెలుగువారు ఆపదలో ఉన్నప్పుడు సాయం చేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందని నాట్స్ పేర్కొంది. వరద బాధితుల కోసం నాట్స్ వెబ్సైట్ మరియు గో ఫండ్ ద్వారా నాట్స్ విరాళాల సేకరణకు నడుంబిగించింది. ప్రతి ఒక్కరూ తాము చేయగలిగిన సాయాన్ని విరాళంగా అందించాలని కోరింది.
ఈ క్రింద లింకులు చూడగలరు.
https://www.natsworld.org/nats-global/s/support-flood-victims-in-andhra-pradesh-telangana?sid=188 లేదా http://https://gofund.me/dcd7449a
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







