మొత్తానికి వారసుడొచ్చేశాడు.! ‘సింబా’ ఈజ్ కమింగ్.!
- September 06, 2024
వారసుడొచ్చేశాడు. అదేనండీ.! నందమూరి వారసుడు బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అయ్యింది.
ఈ దర్శకుడు, ఆ దర్శకుడు.. అంటూ ఫైనల్గా ‘హనుమాన్’ సంచలన దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఓటేశాడు బాలయ్య.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు నందమూరి తెరంగేట్రం జరుగుతోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్పై ప్రచారం జరుగుతోంది. ఫైనల్గా ప్రకటించేశారు. గురువారం అనగా సెప్టెంబర్ 5న మోక్షు పుట్టినరోజు సందర్భంగా తన డెబ్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగింది.
‘సింబా’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెగ్యులర్ షూటింగ్ తదితర వివరాలు త్వరలోనే తెలియాల్సి వుంది.
కాగా, ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ రిలీజ్ చేసిన మోక్షు పోస్టర్కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టైలింగ్, లుక్స్లో మోక్షు మేకోవర్కి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపో్తున్నారు. చూడాలి మరి, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా పరిచయమవుతున్న మోక్షు తెరంగేట్రం ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!