మొత్తానికి వారసుడొచ్చేశాడు.! ‘సింబా’ ఈజ్ కమింగ్.!
- September 06, 2024
వారసుడొచ్చేశాడు. అదేనండీ.! నందమూరి వారసుడు బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అయ్యింది.
ఈ దర్శకుడు, ఆ దర్శకుడు.. అంటూ ఫైనల్గా ‘హనుమాన్’ సంచలన దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఓటేశాడు బాలయ్య.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు నందమూరి తెరంగేట్రం జరుగుతోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్పై ప్రచారం జరుగుతోంది. ఫైనల్గా ప్రకటించేశారు. గురువారం అనగా సెప్టెంబర్ 5న మోక్షు పుట్టినరోజు సందర్భంగా తన డెబ్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగింది.
‘సింబా’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెగ్యులర్ షూటింగ్ తదితర వివరాలు త్వరలోనే తెలియాల్సి వుంది.
కాగా, ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ రిలీజ్ చేసిన మోక్షు పోస్టర్కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టైలింగ్, లుక్స్లో మోక్షు మేకోవర్కి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపో్తున్నారు. చూడాలి మరి, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా పరిచయమవుతున్న మోక్షు తెరంగేట్రం ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









