మొత్తానికి వారసుడొచ్చేశాడు.! ‘సింబా’ ఈజ్ కమింగ్.!
- September 06, 2024
వారసుడొచ్చేశాడు. అదేనండీ.! నందమూరి వారసుడు బాలయ్య ముద్దుల తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ షురూ అయ్యింది.
ఈ దర్శకుడు, ఆ దర్శకుడు.. అంటూ ఫైనల్గా ‘హనుమాన్’ సంచలన దర్శకుడు ప్రశాంత్ వర్మకు ఓటేశాడు బాలయ్య.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు నందమూరి తెరంగేట్రం జరుగుతోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్పై ప్రచారం జరుగుతోంది. ఫైనల్గా ప్రకటించేశారు. గురువారం అనగా సెప్టెంబర్ 5న మోక్షు పుట్టినరోజు సందర్భంగా తన డెబ్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగింది.
‘సింబా’ అనే టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెగ్యులర్ షూటింగ్ తదితర వివరాలు త్వరలోనే తెలియాల్సి వుంది.
కాగా, ‘సింబా ఈజ్ కమింగ్’ అంటూ రిలీజ్ చేసిన మోక్షు పోస్టర్కి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్టైలింగ్, లుక్స్లో మోక్షు మేకోవర్కి సినీ విమర్శకులు సైతం ఆశ్చర్యపో్తున్నారు. చూడాలి మరి, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ద్వారా పరిచయమవుతున్న మోక్షు తెరంగేట్రం ఎలా వుండబోతోందో.!
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









