వాహనదారులకు గుడ్ న్యూస్....
- September 06, 2024
భారతదేశంలో ప్రతి ఒక్క వాహనదారులకు అతి త్వరలోనే అదిరిపోయే శుభవార్త రానుంది. డీజిల్, పెట్రోల్ ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉందని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. గురువారం రోజున పలు ఆంగ్ల టెలివిజన్ చానల్లలో ఈ విషయం గురించి తెలిసిన సమాచారాన్ని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
చివరిసారిగా కేంద్రం సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ మీద రూ. 2 రూపాయల చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అమలులోకి వచ్చాయి. అంతకు ముందు మాత్రం దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడప్పుడుకొన్ని ఒడుదోడుకుల నడుమ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భారీగా పెరగడం జరిగింది. ఈ క్రమంలో దేశీయంగా ఆయిల్ కంపెనీలు మాత్రం ధరలను పెంచలేకపోయాయి. అప్పటికే గరిష్టాలకు చేరగా.....స్థిరంగా ఉంచుతూ వచ్చాయి.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







