వాహనదారులకు గుడ్ న్యూస్....
- September 06, 2024
భారతదేశంలో ప్రతి ఒక్క వాహనదారులకు అతి త్వరలోనే అదిరిపోయే శుభవార్త రానుంది. డీజిల్, పెట్రోల్ ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉందని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. గురువారం రోజున పలు ఆంగ్ల టెలివిజన్ చానల్లలో ఈ విషయం గురించి తెలిసిన సమాచారాన్ని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
చివరిసారిగా కేంద్రం సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ మీద రూ. 2 రూపాయల చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అమలులోకి వచ్చాయి. అంతకు ముందు మాత్రం దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడప్పుడుకొన్ని ఒడుదోడుకుల నడుమ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భారీగా పెరగడం జరిగింది. ఈ క్రమంలో దేశీయంగా ఆయిల్ కంపెనీలు మాత్రం ధరలను పెంచలేకపోయాయి. అప్పటికే గరిష్టాలకు చేరగా.....స్థిరంగా ఉంచుతూ వచ్చాయి.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







