వాహనదారులకు గుడ్ న్యూస్....
- September 06, 2024
భారతదేశంలో ప్రతి ఒక్క వాహనదారులకు అతి త్వరలోనే అదిరిపోయే శుభవార్త రానుంది. డీజిల్, పెట్రోల్ ధరల్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉందని సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ విషయం తెలిసింది. గురువారం రోజున పలు ఆంగ్ల టెలివిజన్ చానల్లలో ఈ విషయం గురించి తెలిసిన సమాచారాన్ని పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.
చివరిసారిగా కేంద్రం సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ మీద రూ. 2 రూపాయల చొప్పున తగ్గించిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ అమలులోకి వచ్చాయి. అంతకు ముందు మాత్రం దాదాపు రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభ సమయంలో అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో అప్పుడప్పుడుకొన్ని ఒడుదోడుకుల నడుమ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా చమురు ధరలు భారీగా పెరగడం జరిగింది. ఈ క్రమంలో దేశీయంగా ఆయిల్ కంపెనీలు మాత్రం ధరలను పెంచలేకపోయాయి. అప్పటికే గరిష్టాలకు చేరగా.....స్థిరంగా ఉంచుతూ వచ్చాయి.
--సాయి కిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









