తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్
- September 06, 2024
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మహేష్ కుమార్ గౌడ్ కు ఇంతటి ప్రాధాన్యత కల్పించడంపై బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు.
పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తే ఉన్నత పదవులు కట్టబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు.
బీసీ నేతకు పెద్ద కుర్చి..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరును పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లందరితో సత్సంబంధాలు ఉన్న నేపధ్యంలో అధిష్టానం ఆయనకే పట్టం కట్టాలని నిర్ణయించింది. బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడంపై బీసీ నాయకులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీపీసీ చీఫ్ గా నియామక పత్రం..

మహేష్ కుమార్ గౌడ్ కు ఇంతటి ప్రాధాన్యత కల్పించడంపై బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు ఫుల్ జోష్ లో ఉన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తే ఉన్నత పదవులు కట్టబెడుతుందని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారు.
ప్రొఫైల్..
తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ పేరును హైకమాండ్ ఖరారు చేసింది. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ లోని భీంగల్ మండలం రహత్నగర్ లో మహేష్ కుమార్ గౌడ్ జన్మించారు. NSUI రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా సేవలందించారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా డిచ్పల్లి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు.
తాజా వార్తలు
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...









