ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?

- September 07, 2024 , by Maagulf
ట్రాఫిక్ ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమా?

యూఏఈ: అబుదాబి పోలీసులు రెండు ట్రాఫిక్ ప్రమాదాల విజువల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.  మొదటి వీడియోలో నాలుగు చక్రాల డ్రైవ్ రోడ్డు మధ్యలో ఆపివేయడంతో వెనుకనున్న వాహనాలు దూసుకొచ్చి ప్రమాదం జరిగింది.  రెండవ సంఘటన ట్రాఫిక్ జామ్ కారణంగా ఆగిపోయిన వాహనాల వరుసలోకి వేగంగా వచ్చిన వాహనం కారణంగా ప్రమాదం జరిగింది. ముందు వాహనాలు ఆగినా డ్రైవర్ వాటిని గుర్తించడంలో పొరబాటు చేయడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 కార్లు ప్రమాదానికి గురయ్యాయి.  ఈ సందర్భంగా పోలీసులు కీలక సూచనలు చేశారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డు మధ్యలో ఆపవద్దని అబుదాబి పోలీసుల ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీ పెట్రోల్స్ డైరెక్టరేట్ గుర్తు చేసింది. ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచడానికి డ్రైవర్లు సమీపంలోని ఎగ్జిట్ కేంద్రాలకు వెళ్లాలని కోరారు. అయితే, వాహనదారులు తమ వాహనాన్ని తరలించలేని పక్షంలో, ట్రాఫిక్‌ను అడ్డుకోవడం మరియు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సహాయం కోసం 999కి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు కాల్ చేయాలని వారు కోరారు. కాగా, యూఏఈలో అపసవ్యంగా డ్రైవింగ్ చేయడం అనేది తీవ్రమైన ట్రాఫిక్ నేరం. ఇందుకు 800 దిర్హామ్‌ల జరిమానాతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తారు. రోడ్డు మధ్యలో వాహనాన్ని ఆపితే 1,000 దిర్హామ్ జరిమానా సహా ఆరు బ్లాక్ పాయింట్ల జరిమానా విధించబడుతుంది. యూఏఈలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల సంభవిస్తున్నాయి.  వాహనదారుల 'దుష్ప్రవర్తన' కారణంగా మరణాలు 3 శాతం పెరిగాయని  ఇటీవలి నివేదిక తెలిపింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) 2023లో రోడ్డు భద్రత గణాంకాలపై ఇటీవల అప్‌లోడ్ చేసిన ‘ఓపెన్ డేటా’ ప్రకారం 2023లో దేశవ్యాప్తంగా 352 రోడ్డు మరణాలు సంభవించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com