సౌదీలో పడవలపై తొలిసారిగా నియంత్రణ..ఇక లైసెన్సులు తప్పనిసరి..!
- September 08, 2024
జెడ్డా: సౌదీ ఎర్ర సముద్రం అథారిటీ (SRSA) తన భౌగోళిక పరిధిలో సౌదీ అరేబియాలో పడవల కదలికలపై మొదటిసారిగా నియంత్రణలు విధించింది. యాచ్ కార్యకలాపాలను నియంత్రించడం, టూరిజం మరియు లీజర్ లైసెన్స్లు, పర్మిట్ల జారీని నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ, తీరప్రాంత పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహం చేస్తుందన్నారు. పర్యాటకం కోసం లైసెన్సులను జారీ చేయడానికి షరతులు, విధానాలను రూపొందించారు. సముద్ర పర్యాటక ఏజెంట్ లేదా యాచ్ మేనేజ్మెంట్ కంపెనీలకు లైసెన్స్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని అథారిటీ స్పష్టం చేసింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర జలాల్లో ఫిషింగ్, డైవింగ్ వంటి కార్యకలాపాలకు ఆమోదం తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







