సౌదీ అరేబియాలో 23,871 మందిపై పాస్పోర్ట్ డైరెక్టరేట్ చర్యలు..!
- September 09, 2024
రియాద్: గత హిజ్రీ నెల సఫర్లో నిబంధనలు ఉల్లంఘించిన 23,871మందిపై చర్యలు తీసుకున్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. వివిధ ప్రాంతాలలో పాస్పోర్ట్ విభాగాల ఆధ్వర్యంలోని అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు రెసిడెన్సీ లా, లేబర్ లా, బోర్డర్ సెక్యూరిటీ నిబంధనలను ఉల్లంఘించినందుకు పౌరులు, ప్రవాసులకు జైలుశిక్ష, జరిమానాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రవాసులు జైలుశిక్ష, జరిమానాలు చెల్లించిన తర్వాత వారిని దేశం నుంచి బహిష్కరిస్తారు. ఈ సందర్భంగా రవాణా, ఉద్యోగం లేదా ఆశ్రయం ఇవ్వవద్దని పాస్పోర్ట్స్ డైరెక్టరేట్ పిలుపునిచ్చింది. మక్కా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలోని ఫోన్ నంబర్ 911.. కింగ్డమ్లోని మిగిలిన ప్రాంతాలలో 999 నంబర్కు ఉల్లంఘనలను నివేదించాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









