ఇండియన్ ఫుడ్ & ఆగ్రో సెక్టార్.. కువైట్ లో నెట్వర్కింగ్ ఈవెంట్ సక్సెస్..!
- September 11, 2024
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ (IBPC), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) సహకారంతో ఫుడ్ & ఆగ్రో సెక్టార్లలో ఇండియా-కువైట్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. క్రౌన్ ప్లాజా హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కువైట్ లోని దిగుమతిదారులు, F&B నిపుణులు పాల్గొన్నారు. ఇండో-కువైట్ వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను హైలైట్ చేశారు. ఇండియా నుండి దిగుమతుల ప్రాముఖ్యతను వివరించారు. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకారం.. కువైట్కు ఇండియా ఎగుమతులు FY 2023-24 సమయంలో USD 2.1 బిలియన్లకు చేరుకున్నాయి.ఈ కార్యక్రమానికి కువైట్లోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా పాల్గొన్నారు.రెండు వ్యాపార సంఘాలను వారధిగా చేయడంలో IBPC చేస్తున్న కృషిని ప్రశంసించారు. కువైట్ ప్రత్యర్ధులతో లోతైన సంబంధాలను పెంపొందిస్తూ వ్యాపార అవకాశాలను శ్రద్ధగా కొనసాగించాలని ఆయన భారతీయ ప్రతినిధులకు సూచించారు.ఈ ఈవెంట్లో 31 భారతీయ ఫుడ్ & ఆగ్రో కంపెనీల ప్రతినిధి బృందాలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం
- ఢిల్లీలోని పాక్ హైకమిషన్లో ఐఎస్ఐ ఏజెంట్..
- ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఏపీకి చేరుకున్న యువకులు
- ట్రంప్ మిడిలీస్ట్ పర్యటనను ప్రారంభం..తొలి విదేశీ పర్యటన..!!
- కువైట్ ప్రైవేట్ ఫార్మసీలలో 69 మెడిసిన్ ధరలపై నియంత్రణ..!!
- జాసిమ్ బిన్ హమద్ స్ట్రీట్ లో ట్రాఫిక్ ఆంక్షలు..మూసివేత..!!
- రియాద్లో బైక్ డెలివరీ ఆర్డర్లు నిలిపివేత..!!
- CBSE 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల..!!
- పార్కింగ్ వివాదం.. ముగ్గురు మహిళలను కాల్చిచంపిన నిందితుడు..!!
- జార్ఖండ్లో శస్త్రచికిత్స శిబిరాలు నిర్వహించిన శంకర నేత్రాలయ