సౌదీ వాణిజ్యంలో ఇ-కామర్స్ 8%.. నవంబర్ 5న బిబాన్ 24 ఫోరమ్..!!
- September 11, 2024
బురైదా: సౌదీ అరేబియాలోని మొత్తం వాణిజ్యంలో ఇ-కామర్స్ రంగం 8% వాటాను కలిగి ఉందని సౌదీ వాణిజ్య మంత్రి మాజిద్ అల్-కసాబీ తెలిపారు. అంచనాల ప్రకారం.. 2025 నాటికి ఈ రంగం ఆదాయాలు SR260 బిలియన్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు 95% పెరిగాయని, 2018లో కేవలం 10 కంపెనీల సంఖ్య మాత్రమే ఉన్నందున ప్రస్తుతం 170కి పైగా పెరిగాయని అల్-కసాబీ తెలిపారు. ఖాసిం ఛాంబర్లో వ్యాపారులు, మహిళలు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వినియోగదారుల రక్షణకు సంబంధించి.. మార్కెట్, ధరల నియంత్రణ, మోసాలను ఎదుర్కోవడం, వాణిజ్యపరమైన కవర్-అప్ కోసం నియమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిపుణుల అథారిటీ అధ్యయనం చేస్తున్న వినియోగదారుల రక్షణ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. రుణ సౌకర్యాలలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా SR275 బిలియన్లు, మొత్తంగా 8.7% నికి సమానం అని మంత్రి వివరించారు. నవంబర్ 5న రియాద్లో నిర్వహించనున్న బిబాన్ 24 ఫోరమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎంటర్ప్రైజెస్కు, పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







