సౌదీ వాణిజ్యంలో ఇ-కామర్స్ 8%.. నవంబర్ 5న బిబాన్ 24 ఫోరమ్..!!
- September 11, 2024
బురైదా: సౌదీ అరేబియాలోని మొత్తం వాణిజ్యంలో ఇ-కామర్స్ రంగం 8% వాటాను కలిగి ఉందని సౌదీ వాణిజ్య మంత్రి మాజిద్ అల్-కసాబీ తెలిపారు. అంచనాల ప్రకారం.. 2025 నాటికి ఈ రంగం ఆదాయాలు SR260 బిలియన్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు 95% పెరిగాయని, 2018లో కేవలం 10 కంపెనీల సంఖ్య మాత్రమే ఉన్నందున ప్రస్తుతం 170కి పైగా పెరిగాయని అల్-కసాబీ తెలిపారు. ఖాసిం ఛాంబర్లో వ్యాపారులు, మహిళలు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వినియోగదారుల రక్షణకు సంబంధించి.. మార్కెట్, ధరల నియంత్రణ, మోసాలను ఎదుర్కోవడం, వాణిజ్యపరమైన కవర్-అప్ కోసం నియమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిపుణుల అథారిటీ అధ్యయనం చేస్తున్న వినియోగదారుల రక్షణ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. రుణ సౌకర్యాలలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా SR275 బిలియన్లు, మొత్తంగా 8.7% నికి సమానం అని మంత్రి వివరించారు. నవంబర్ 5న రియాద్లో నిర్వహించనున్న బిబాన్ 24 ఫోరమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎంటర్ప్రైజెస్కు, పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









