సౌదీ వాణిజ్యంలో ఇ-కామర్స్ 8%.. నవంబర్ 5న బిబాన్ 24 ఫోరమ్..!!
- September 11, 2024
బురైదా: సౌదీ అరేబియాలోని మొత్తం వాణిజ్యంలో ఇ-కామర్స్ రంగం 8% వాటాను కలిగి ఉందని సౌదీ వాణిజ్య మంత్రి మాజిద్ అల్-కసాబీ తెలిపారు. అంచనాల ప్రకారం.. 2025 నాటికి ఈ రంగం ఆదాయాలు SR260 బిలియన్లకు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలు 95% పెరిగాయని, 2018లో కేవలం 10 కంపెనీల సంఖ్య మాత్రమే ఉన్నందున ప్రస్తుతం 170కి పైగా పెరిగాయని అల్-కసాబీ తెలిపారు. ఖాసిం ఛాంబర్లో వ్యాపారులు, మహిళలు, పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వినియోగదారుల రక్షణకు సంబంధించి.. మార్కెట్, ధరల నియంత్రణ, మోసాలను ఎదుర్కోవడం, వాణిజ్యపరమైన కవర్-అప్ కోసం నియమాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నిపుణుల అథారిటీ అధ్యయనం చేస్తున్న వినియోగదారుల రక్షణ వ్యవస్థ ఉందని ఆయన అన్నారు. రుణ సౌకర్యాలలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల వాటా SR275 బిలియన్లు, మొత్తంగా 8.7% నికి సమానం అని మంత్రి వివరించారు. నవంబర్ 5న రియాద్లో నిర్వహించనున్న బిబాన్ 24 ఫోరమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎంటర్ప్రైజెస్కు, పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..