సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలకు విరామం..!!
- September 14, 2024
దుబాయ్: ప్రవక్త ముహమ్మద్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 15న వీసా అమ్నెస్టీ సేవలు అందుబాటులో ఉండవని దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) ప్రకటించింది. తమ వీసా స్థితిని క్రమబద్ధీకరించుకోవాలనుకునే లేదా దేశం నుండి వెళ్లాలనుకునేవారు తుది గడువు కంటే ముందే సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్ అవీర్లోని స్టేటస్ రెగ్యులరైజేషన్ సెంటర్లో ఉదయం 8 నుండి రాత్రి 8 గంటల వరకు, శుక్రవారాల్లో ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. యూఏఈలో వీసా క్షమాభిక్ష పథకం సెప్టెంబర్ 1న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది అక్రమ ప్రవాసులు తమ హోదాను క్రమబద్ధీకరించుకోవడంతోపాటు ఎమిరేట్స్ విడిచి వెళ్లారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







