యూఏఈ పర్యాటకులకు 10GB డేటాతో ఉచిత eSIM..!
- September 17, 2024
యూఏఈ: యూఏఈకి వచ్చే పర్యాటకులు ఇప్పుడు 10GB ఉచిత డేటాతో ఉచిత తక్షణ eSIMని పొందవచ్చు. యూఏఈ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈమేరకు తెలిపారు. సందర్శకులు ఇమ్మిగ్రేషన్ ద్వారా పాస్ అయిన వెంటనే వారి 'ఫ్రీ విజిటర్ లైన్ eSIM'ని యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఉచిత eSIM కూడా 10GB కాంప్లిమెంటరీ డేటాతో వస్తుందన్నారు. దేశాన్ని సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇ & చీఫ్ కన్స్యూమర్ ఆఫీసర్ ఖలీద్ ఎల్ఖౌలీ తెలిపారు. దుబాయ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. గత సంవత్సరం,దుబాయ్ 17.15 మిలియన్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించగా.. అబుదాబిని 3.8 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







