తెలంగాణ: గల్ఫ్ కార్మికులకు భరోసా…సీఎం రేవంత్ ని కలిసిన NRI సెల్
- September 21, 2024
హైదరాబాద్: ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగానే గల్ఫ్ కార్మికులకు భరోసా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కృతజ్ఞతలు తెలియజేసింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రిని ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్కుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు. సీఎంను కలిసిన వారిలో బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, గల్ఫ్ జేఏసీ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, ఇతర నేతలు మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, తోట ధర్మేందర్, రవిగౌడ్ తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









