యూఏఈలో మొదటి మహిళా ల్యాండ్ రెస్క్యూ టీమ్..!!
- September 21, 2024
దుబాయ్: యూఏఈలో 18 మంది నాన్-కమిషన్డ్ ఆఫీసర్లతో కూడిన మొదటి మహిళా ల్యాండ్ రెస్క్యూ టీమ్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ను దుబాయ్ పోలీసులు జరుపుకున్నారు. ఈ వేడుకకు దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి హాజరయ్యారు. ప్రత్యేక ల్యాండ్ రెస్క్యూ కోర్సుల నుండి గ్రాడ్యుయేషన్ సాధించినందుకు మొదటి మహిళా బృందం సభ్యులను అభినందించారు. వివిధ భద్రత, సైనిక రంగాలలో మహిళలకు నైపుణ్యాలను అందించారు. "భద్రత పోలీసింగ్తో సహా వివిధ రంగాలలో దేశాభివృద్ధిలో ఎమిరాటీ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. భూ రక్షక కార్యకలాపాలలో తమ సహోద్యోగులతో కలిసి పనిచేసే మొదటి మహిళా సభ్యుల బృందం అర్హత సాధించినందుకు మేము గర్విస్తున్నాము." అని అల్ మర్రి పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా రోడ్డు ప్రమాదాల కోసం రెస్క్యూ ఆపరేషన్లు, అగ్నిమాపక చర్యలు, వాహనాల తలుపులు తెరవడం, రెస్క్యూ పరికరాలను ఉపయోగించడం, వైమానిక బెలూన్లను మోహరించడం వంటి వివిధ దృశ్యాలను మహిళా టీం సభ్యులు ప్రదర్శించారు.
తాజా వార్తలు
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి









