యూఏఈలో మొదటి మహిళా ల్యాండ్ రెస్క్యూ టీమ్..!!
- September 21, 2024
దుబాయ్: యూఏఈలో 18 మంది నాన్-కమిషన్డ్ ఆఫీసర్లతో కూడిన మొదటి మహిళా ల్యాండ్ రెస్క్యూ టీమ్ బ్యాచ్ గ్రాడ్యుయేషన్ను దుబాయ్ పోలీసులు జరుపుకున్నారు. ఈ వేడుకకు దుబాయ్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి హాజరయ్యారు. ప్రత్యేక ల్యాండ్ రెస్క్యూ కోర్సుల నుండి గ్రాడ్యుయేషన్ సాధించినందుకు మొదటి మహిళా బృందం సభ్యులను అభినందించారు. వివిధ భద్రత, సైనిక రంగాలలో మహిళలకు నైపుణ్యాలను అందించారు. "భద్రత పోలీసింగ్తో సహా వివిధ రంగాలలో దేశాభివృద్ధిలో ఎమిరాటీ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. భూ రక్షక కార్యకలాపాలలో తమ సహోద్యోగులతో కలిసి పనిచేసే మొదటి మహిళా సభ్యుల బృందం అర్హత సాధించినందుకు మేము గర్విస్తున్నాము." అని అల్ మర్రి పేర్కొన్నారు. గ్రాడ్యుయేషన్ వేడుక సందర్భంగా రోడ్డు ప్రమాదాల కోసం రెస్క్యూ ఆపరేషన్లు, అగ్నిమాపక చర్యలు, వాహనాల తలుపులు తెరవడం, రెస్క్యూ పరికరాలను ఉపయోగించడం, వైమానిక బెలూన్లను మోహరించడం వంటి వివిధ దృశ్యాలను మహిళా టీం సభ్యులు ప్రదర్శించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







