వరల్డ్ ఫుడ్ ఇండియా '24 సదస్సులో పాల్గొన్న కువైట్..!!
- September 21, 2024
కువైట్: భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 (డబ్ల్యూఎఫ్ఐ) కాన్ఫరెన్స్ మూడవ ఎడిషన్ అధికారిక ప్రారంభోత్సవంలో ఇండియాలోని కువైట్ రాయబారి మెషల్ అల్-షెమాలి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన ఈ సదస్సు ప్రపంచ స్థాయిలో ఆహార రంగంలో పెట్టుబడిదారులు, ఉత్పత్తిదారులు, తయారీదారులకు ఒక ముఖ్యమైన అవకాశం అని అల్-షెమాలి తెలిపారు. ఆహార మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే రంగాలలో కువైట్ -ఇండియా మధ్య సహకారం మెరుగుపరచడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందిస్తుందన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ప్రపంచ ఆహార సదస్సులో 90 దేశాలు, అంతర్జాతీయ సంస్థల మంత్రులు, అధికారులు, ఆహార భద్రత, తయారీ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. WFI 2024ని భారతదేశంలోని ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించాయి.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









