అమెరికాలో స్టేజి పై దేవిశ్రీ ప్రసాద్ ని హత్తుకున్న ప్రధాని మోదీ..
- September 23, 2024
అమెరికా: ప్రధాని మోదీ అమెరికా పర్యటన వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో ప్రవాస భారతీయుల సదస్సు ఏర్పాటు చేయగా ప్రధాని మోదీ దీనికి హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో అనేకమంది ఇండియన్ కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వగా మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా స్పెషల్ ప్రఫార్మెన్స్ ఇచ్చారు. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ తో అక్కడి ప్రేక్షకులని అలరించారు.
అనంతరం దేవి శ్రీ ప్రసాద్, హనుమాన్కైంద్, ఆదిత్య గాధ్వి.. హర్ ఘర్ తిరంగా పాట పాడుతూ ప్రధాని మోదీకి స్టేజిపైకి ఆహ్వానం పలికారు. స్టేజిపైకి వచ్చిన ప్రధాని మోదీ దేవి శ్రీ ప్రసాద్ ని దగ్గరకు తీసుకొని కౌగలించుకొని అభినందించారు. దేవితో పాటు స్టేజిపై ఉన్న మిగిలిన కళాకారులను కూడా దగ్గరకు తీసుకొని మోదీ అభినందించారు. దీంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి. అమెరికాలో ప్రవాస భారతీయుల ఈవెంట్లో స్టేజిపై మన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని ప్రధాని మోదీ అభినందించడం విశేషం.
ఈవెంట్ అయ్యాక కూడా మోదీ ప్రత్యేకంగా తనని అభినందించారు అని, షేక్ హ్యాండ్ ఇచ్చారని, ఆయనతో కలిసి సెల్ఫీ దిగాను అని, నాకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది అని దేవి శ్రీ ప్రసాద్ అక్కడి మీడియాతో తెలిపారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









