బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- June 27, 2026
మనామా: బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ నిర్వహించిన డ్రోన్ దాడులను బహ్రెయిన్ ప్రభుత్వం శనివారం తీవ్రంగా ఖండించింది. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఈ తరహా దాడులు శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, ఇందుకు పూర్తి బాధ్యత తెహ్రాన్పైనే ఉందని పేర్కొంది.
బహ్రెయిన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థలో విడుదల చేసిన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, బహ్రెయిన్ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని "అనేక ఇరానియన్ డ్రోన్లు" దాడికి పాల్పడ్డాయి. ఈ చర్య దేశ సార్వభౌమాధికారాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా, పౌరులు మరియు నివాసితుల భద్రతకు తీవ్రమైన ముప్పుగా నిలుస్తుందని పేర్కొంది. అలాగే ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా కూడా అభివర్ణించింది.
దేశ సార్వభౌమాధికారం, భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు తమకు ఉందని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, ఇరాన్ అంతకుముందు అమెరికా బలగాలకు సంబంధించిన లక్ష్యాలపై ప్రాంతంలో దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. అయితే ఆ దాడులు ఎక్కడ జరిగాయి, ఏ లక్ష్యాలను ఉద్దేశించి చేపట్టాయనే వివరాలను వెల్లడించలేదు.
ఈ పరిణామాలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మిడిల్ ఈస్ట్ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







