సీఎం రేవంత్ ఇంటికి మహేష్ బాబు..రూ.50 లక్షలు అందజేత
- September 23, 2024
హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయనిధికి వారి వంతు సహాయం అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయనిధికి విరాళాన్ని అందజేశారు. మహేష్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళాన్ని అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. AMB తరపున మరో రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







