సీఎం రేవంత్ ఇంటికి మహేష్ బాబు..రూ.50 లక్షలు అందజేత
- September 23, 2024
హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయనిధికి వారి వంతు సహాయం అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయనిధికి విరాళాన్ని అందజేశారు. మహేష్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళాన్ని అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. AMB తరపున మరో రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









