సీఎం రేవంత్ ఇంటికి మహేష్ బాబు..రూ.50 లక్షలు అందజేత
- September 23, 2024
హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయనిధికి వారి వంతు సహాయం అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయనిధికి విరాళాన్ని అందజేశారు. మహేష్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళాన్ని అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. AMB తరపున మరో రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!