సీఎం రేవంత్ ఇంటికి మహేష్ బాబు..రూ.50 లక్షలు అందజేత

- September 23, 2024 , by Maagulf
సీఎం రేవంత్ ఇంటికి మహేష్ బాబు..రూ.50 లక్షలు అందజేత

హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయనిధికి వారి వంతు సహాయం అందించిన సంగతి తెలిసిందే. 

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయనిధికి విరాళాన్ని అందజేశారు. మహేష్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళాన్ని అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. AMB తరపున మరో రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది.

--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com