నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ చారిత్రాత్మక ఒప్పందం..!!
- September 24, 2024
దోహా: అంతర్జాతీయ సాంస్కృతిక సహకారంలో ఖతార్ ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనాతో ఖతార్ మ్యూజియంలు అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నాయి. ఖతార్ నేషనల్ మ్యూజియం డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ, నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా డైరెక్టర్ గావో జెంగ్ ఒప్పందంపై సంతకాలు చేశారు. సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి, మ్యూజియంల రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు రెండు సంస్థలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. అదే సమయంలో రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాన్ని మరింత సుసంపన్నం చేయనుందని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్ డైరెక్టర్ షేక్ అబ్దుల్ అజీజ్ అల్ థానీ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!