ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు..5 నెలలగా తిండే లేదట !
- October 02, 2024
ఇరాక్: ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు...తాజాగా తెర పైకి వచ్చాయి.నాలుగు, ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదట యజమాన్యం.దీంతో పని మానేశారు ముగ్గురు కార్మికులు. దీంతో భోజనం పెట్టవద్దని కంపెనీ యజమాని మెస్ కు హుకుం జారీ చేశారు. ఈ తరుణంలోనే... తిండి లేక రూమ్ లోనే ఉంటున్నారు ముగ్గురు కార్మికులు. అయితే.. వీరి కష్టాల నేపథ్యంలోనే.. హైదరాబాద్ లో సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.
ఈ ఫిర్యాదు అందగానే... ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో ఆ యజమానిని పిలిపించింది భారత రాయబార కార్యాలయం.అయితే... ఎంబసీకి ఫిర్యాదు చేశారని ముగ్గురు తెలంగాణ కార్మిలకుల పై యజమాని దాడి చేశాడట. అటు 20 రోజుల క్రితం ఈ ముగ్గురు పై దాడి చేసి బలవంతంగా పనిలోకి పంపాడు యజమాని. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరన్నపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన హరీష్, నిజామాబాద్ జిల్లా కి చెందిన రాజన్న లు ఐదు నెలలుగా ఇరాక్ లో తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ కు చెందిన ఓ ఏజెంట్ కు ఒక్కొక్కరు 2,50,000 చెల్లించారట. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిథి)
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







