ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు..5 నెలలగా తిండే లేదట !
- October 02, 2024
ఇరాక్: ఇరాక్ లో జగిత్యాల జిల్లా వాసుల కష్టాలు...తాజాగా తెర పైకి వచ్చాయి.నాలుగు, ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదట యజమాన్యం.దీంతో పని మానేశారు ముగ్గురు కార్మికులు. దీంతో భోజనం పెట్టవద్దని కంపెనీ యజమాని మెస్ కు హుకుం జారీ చేశారు. ఈ తరుణంలోనే... తిండి లేక రూమ్ లోనే ఉంటున్నారు ముగ్గురు కార్మికులు. అయితే.. వీరి కష్టాల నేపథ్యంలోనే.. హైదరాబాద్ లో సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.
ఈ ఫిర్యాదు అందగానే... ఇరాక్ లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీంతో ఆ యజమానిని పిలిపించింది భారత రాయబార కార్యాలయం.అయితే... ఎంబసీకి ఫిర్యాదు చేశారని ముగ్గురు తెలంగాణ కార్మిలకుల పై యజమాని దాడి చేశాడట. అటు 20 రోజుల క్రితం ఈ ముగ్గురు పై దాడి చేసి బలవంతంగా పనిలోకి పంపాడు యజమాని. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోరన్నపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య, బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన హరీష్, నిజామాబాద్ జిల్లా కి చెందిన రాజన్న లు ఐదు నెలలుగా ఇరాక్ లో తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ కు చెందిన ఓ ఏజెంట్ కు ఒక్కొక్కరు 2,50,000 చెల్లించారట. మరి దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిథి)
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









