జపాన్లో పేలిన వరల్డ్ వార్-2 బాంబ్!
- October 03, 2024
జపాన్: జపాన్లోని మియాజాకీ విమానాశ్రయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన బాంబు ఒకటి పేలింది. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం నాటిదిగా అధికారులు గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇక్కడ పాతిపెట్టిన బాంబు, ఇన్నేళ్ల తర్వాత పేలింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది.
పేలుడు సమయంలో అక్కడ విమానాలేవీ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే గొయ్యి కారణంగా దాదాపు 80కిపైగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. సమాచారం అందుకున్న సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. 500 పౌండ్ల బరువైన బాంబు పేలినట్లు నిర్ధారించారు. 1943లో మియాజాకి ఎయిర్పోర్టును నిర్మించారు.
మాజీ ఇంపీరియల్ జపనీస్ నేవీ ఫైట్ ట్రైనింగ్ ఫీల్డ్గా దీన్ని వాడేవారు. ఆత్మాహుతి దాడిమిషన్లో భాగంగా కొందరు పైలట్లు ఇక్కడి నుంచే బయల్దేరేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం ఇక్కడ జాడవిరిచిన కొన్ని బాంబుల్లో పేలనివి ఈ ప్రాంతంలో భాగర్భంలో ఉండిపోయాయి. భూమి కిందిపొరల్లో ఒత్తిళ్లు ఏర్పడినప్పుడు ఇవి పేలుతుంటాయి అని రక్షణ అధికారులు తెలిపారు. ఇలాంటి ఎన్నో బాంబులు జపాన్ చుట్టూ అగ్రరాజ్యం పాతిపెట్టిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









