జపాన్లో పేలిన వరల్డ్ వార్-2 బాంబ్!
- October 03, 2024
జపాన్: జపాన్లోని మియాజాకీ విమానాశ్రయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన బాంబు ఒకటి పేలింది. దీనిని రెండవ ప్రపంచ యుద్ధం నాటిదిగా అధికారులు గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇక్కడ పాతిపెట్టిన బాంబు, ఇన్నేళ్ల తర్వాత పేలింది. దీంతో ఆ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది.
పేలుడు సమయంలో అక్కడ విమానాలేవీ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే గొయ్యి కారణంగా దాదాపు 80కిపైగా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. సమాచారం అందుకున్న సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకున్నారు. 500 పౌండ్ల బరువైన బాంబు పేలినట్లు నిర్ధారించారు. 1943లో మియాజాకి ఎయిర్పోర్టును నిర్మించారు.
మాజీ ఇంపీరియల్ జపనీస్ నేవీ ఫైట్ ట్రైనింగ్ ఫీల్డ్గా దీన్ని వాడేవారు. ఆత్మాహుతి దాడిమిషన్లో భాగంగా కొందరు పైలట్లు ఇక్కడి నుంచే బయల్దేరేవారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం ఇక్కడ జాడవిరిచిన కొన్ని బాంబుల్లో పేలనివి ఈ ప్రాంతంలో భాగర్భంలో ఉండిపోయాయి. భూమి కిందిపొరల్లో ఒత్తిళ్లు ఏర్పడినప్పుడు ఇవి పేలుతుంటాయి అని రక్షణ అధికారులు తెలిపారు. ఇలాంటి ఎన్నో బాంబులు జపాన్ చుట్టూ అగ్రరాజ్యం పాతిపెట్టిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







