ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- October 06, 2024
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ 130 మందికి పైగా టీచర్లకు ప్రమోషన్లను ఇచ్చింది. వారిని సీనియర్ టీచర్లుగా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసా టౌన్లోని మినిస్ట్రీ హాల్లో టీచర్లకు ప్రమోషన్ లెటర్లను అందజేయనున్నట్లు పేర్కొంది. దేశ భవిష్యత్తును రూపొందించడంలో అధ్యాపకుల కృషిని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశసించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యా శాఖకు హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ అందిస్తున్న సహాయాన్ని విద్యాశాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ జుమా ప్రశంసించారు.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







