ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం..130 మంది టీచర్లకు ప్రమోషన్లు..!!
- October 06, 2024
మనామా: బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ 130 మందికి పైగా టీచర్లకు ప్రమోషన్లను ఇచ్చింది. వారిని సీనియర్ టీచర్లుగా ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసా టౌన్లోని మినిస్ట్రీ హాల్లో టీచర్లకు ప్రమోషన్ లెటర్లను అందజేయనున్నట్లు పేర్కొంది. దేశ భవిష్యత్తును రూపొందించడంలో అధ్యాపకుల కృషిని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశసించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యా శాఖకు హెచ్ఆర్హెచ్ ప్రిన్స్ సల్మాన్ అందిస్తున్న సహాయాన్ని విద్యాశాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ జుమా ప్రశంసించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







