ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- May 28, 2026
తప్పక గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 రన్స్ టార్గెట్ ను చేదించే క్రమంలో హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విక్టరీ కొట్టింది.
కీలక మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దాంతో ఎస్ఆర్ హెచ్ ఒత్తిడిలోకి వెళ్లింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ చెలరేగాడు. 3 వికెట్లు తీసి హైదరాబాద్ ను దెబ్బకొట్టాడు. బర్గర్, మిశ్రా, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. యశ్ రాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, మే 29న గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫయర్ 2 ఆడనుంది రాజస్తాన్ రాయల్స్.
ఈ మ్యాచ్ హీరో 15ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడంతో ఏ రేంజ్ లో ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ భారీ స్కోర్ చేయడంలో, ఎస్ఆర్ హెచ్ ను ఒత్తిడిలోకి నెట్టడంలో వైభవ్ సూర్యవంశీ రోల్ చాలా కీలకం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







