ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- May 28, 2026
తప్పక గెలవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. 244 రన్స్ టార్గెట్ ను చేదించే క్రమంలో హైదరాబాద్ 19.2 ఓవర్లలో 196 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దాంతో 47 పరుగుల తేడాతో రాజస్తాన్ విక్టరీ కొట్టింది.
కీలక మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్ లోనే అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. దాంతో ఎస్ఆర్ హెచ్ ఒత్తిడిలోకి వెళ్లింది. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ చెలరేగాడు. 3 వికెట్లు తీసి హైదరాబాద్ ను దెబ్బకొట్టాడు. బర్గర్, మిశ్రా, జడేజా తలో రెండు వికెట్లు తీశారు. యశ్ రాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇక, మే 29న గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫయర్ 2 ఆడనుంది రాజస్తాన్ రాయల్స్.
ఈ మ్యాచ్ హీరో 15ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. 29 బంతుల్లోనే 97 పరుగులు చేశాడంతో ఏ రేంజ్ లో ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ భారీ స్కోర్ చేయడంలో, ఎస్ఆర్ హెచ్ ను ఒత్తిడిలోకి నెట్టడంలో వైభవ్ సూర్యవంశీ రోల్ చాలా కీలకం.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







