BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- October 07, 2024
మనామా: బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్(BNI) బహ్రెయిన్ గల్ఫ్ హోటల్లో హై-ప్రొఫైల్ బిజినెస్ కాంక్లేవ్ నిర్వహించింది. BNI ఇండియా నుండి 46 మంది భారతీయ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. క్రాస్ బార్డర్ వ్యాపార సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కె. జాకబ్ పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ బుఖమ్మస్, బహ్రెయిన్ కేరళీయ సమాజం అధ్యక్షుడు పి. రాధాకృష్ణన్ పిళ్లై, డైరెక్టర్ వరల్డ్ NRI కౌన్సిల్ బహ్రెయిన్ సుధీర్ తిరునిలత్ కూడా హాజరయ్యారు. భారత్-బహ్రెయిన్ వ్యాపారాల మధ్య పెరుగుతున్న సంబంధాలను భారత రాయబారి వివరించారు. ప్రపంచ భారతీయ పెట్టుబడులకు బహ్రెయిన్ లో ఉన్న అవకాశాలను వివరించారు. భారత్ నుండి 46 మంది వ్యాపార ప్రముఖులను తీసుకురావడం ద్వారా సరిహద్దుల గుండా నెట్వర్కింగ్ చేయడంలో BNI నిజమైన స్ఫూర్తిని తెలియజేస్తుందని BNI బహ్రెయిన్ జాతీయ డైరెక్టర్ శ్రీ అరుణోదయ్ గంగూలీ అన్నారు.
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార రిఫరల్ నెట్వర్కింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. దీనిని 1985లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 330,000 మంది సభ్యులు 78 దేశాలలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









