BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- October 07, 2024
మనామా: బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్(BNI) బహ్రెయిన్ గల్ఫ్ హోటల్లో హై-ప్రొఫైల్ బిజినెస్ కాంక్లేవ్ నిర్వహించింది. BNI ఇండియా నుండి 46 మంది భారతీయ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. క్రాస్ బార్డర్ వ్యాపార సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కె. జాకబ్ పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ బుఖమ్మస్, బహ్రెయిన్ కేరళీయ సమాజం అధ్యక్షుడు పి. రాధాకృష్ణన్ పిళ్లై, డైరెక్టర్ వరల్డ్ NRI కౌన్సిల్ బహ్రెయిన్ సుధీర్ తిరునిలత్ కూడా హాజరయ్యారు. భారత్-బహ్రెయిన్ వ్యాపారాల మధ్య పెరుగుతున్న సంబంధాలను భారత రాయబారి వివరించారు. ప్రపంచ భారతీయ పెట్టుబడులకు బహ్రెయిన్ లో ఉన్న అవకాశాలను వివరించారు. భారత్ నుండి 46 మంది వ్యాపార ప్రముఖులను తీసుకురావడం ద్వారా సరిహద్దుల గుండా నెట్వర్కింగ్ చేయడంలో BNI నిజమైన స్ఫూర్తిని తెలియజేస్తుందని BNI బహ్రెయిన్ జాతీయ డైరెక్టర్ శ్రీ అరుణోదయ్ గంగూలీ అన్నారు.
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార రిఫరల్ నెట్వర్కింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. దీనిని 1985లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 330,000 మంది సభ్యులు 78 దేశాలలో ఉన్నారు.
తాజా వార్తలు
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్
- జెడ్డాలో 12 లైసెన్సు లేని వాటర్ బాట్లింగ్ ప్లాంట్లు సీజ్..!!
- యూఏఈ లాటరీ: Dh100,000 బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- ముగిసిన సంక్షోభం..భారీగా ఖర్చు పెడుతున్న కువైట్ కన్జుమర్స్..!!
- ఐక్యరాజ్యసమితికి పురోగతి నివేదిక సమర్పించిన బహ్రెయిన్..!!
- ఖతార్ లో 17 ట్రావెల్, ఎయిర్ కార్గొ ఏజెన్సీలు సీజ్..!!
- మాదక ద్రవ్యాల రవాణా పై ఒమన్ పోలీసులు ఉక్కుపాదం..!!







