BNI ఇండియా డెలిగేషన్తో బిజినెస్ కాంక్లేవ్.. 46 మంది హాజరు..!!
- October 07, 2024
మనామా: బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్(BNI) బహ్రెయిన్ గల్ఫ్ హోటల్లో హై-ప్రొఫైల్ బిజినెస్ కాంక్లేవ్ నిర్వహించింది. BNI ఇండియా నుండి 46 మంది భారతీయ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. క్రాస్ బార్డర్ వ్యాపార సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బహ్రెయిన్లోని భారత రాయబారి వినోద్ కె. జాకబ్ పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యుడు డాక్టర్ హసన్ బుఖమ్మస్, బహ్రెయిన్ కేరళీయ సమాజం అధ్యక్షుడు పి. రాధాకృష్ణన్ పిళ్లై, డైరెక్టర్ వరల్డ్ NRI కౌన్సిల్ బహ్రెయిన్ సుధీర్ తిరునిలత్ కూడా హాజరయ్యారు. భారత్-బహ్రెయిన్ వ్యాపారాల మధ్య పెరుగుతున్న సంబంధాలను భారత రాయబారి వివరించారు. ప్రపంచ భారతీయ పెట్టుబడులకు బహ్రెయిన్ లో ఉన్న అవకాశాలను వివరించారు. భారత్ నుండి 46 మంది వ్యాపార ప్రముఖులను తీసుకురావడం ద్వారా సరిహద్దుల గుండా నెట్వర్కింగ్ చేయడంలో BNI నిజమైన స్ఫూర్తిని తెలియజేస్తుందని BNI బహ్రెయిన్ జాతీయ డైరెక్టర్ శ్రీ అరుణోదయ్ గంగూలీ అన్నారు.
బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార రిఫరల్ నెట్వర్కింగ్ సంస్థగా గుర్తింపు పొందింది. దీనిని 1985లో స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 330,000 మంది సభ్యులు 78 దేశాలలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం
- హర్మూజ్ దిగ్బంధనం పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- కుప్పకూలిన 2వేల కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్
- ఎయిరిండియాకు రూ.22వేల కోట్ల భారీ నష్టం
- యూఏఈ లాటరీ తొలి రిటైల్ షాపు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో కల్చరల్ ఇవెంట్స్ కు ఆదరణ..!!
- ఖతార్ లో పలు ట్రావెల్ ఏజెన్సీలపై చర్యలు..!!
- ప్రైవేట్ పాఠశాలల్లో ఉద్యోగ కోతలు..!!









