తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్
- October 07, 2024
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయిని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల కొండపైకి వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు పేర్కొన్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా రేపు గరుడ వాహన సేవ ఉంటుంది. దీంతో ఇవాళ్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రైవేట్ ట్యాక్సిలకు ఘాట్ రోడ్డులో నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహానాలకు అనుమతి నిలిపివేస్తున్నారు. అటు రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు, నడకమార్గం తెరిచి వుంచనున్నారు టిటిడి అధికారులు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









