ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
- October 09, 2024
అమరావతి: కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మద్యం షాపులు దక్కించుకోవాలనుకునే ఆశావహులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
టెండర్ల షెడ్యూల్ మార్పు కొరుతూ వివిధ జిల్లాల్లో ఉన్న దరఖాస్తుదారుల నుంచి భారీ ఎత్తున్న అభ్యర్థనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో సర్కార్ షెడ్యూల్ను మార్చింది.
ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అలాగే 14న మద్యం షాపులకు లాటరీ విధానంలో డ్రా తీసి, 16 నుంచి దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించడం జరుగుతుందని పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు గాను మంగళవారం రాత్రి వరకు 41,348 దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.826.96కోట్ల ఆదాయం వచ్చి చేరినట్లు సమాచారం. కాగా, ఒక్కొ దరఖాస్తుకు నాన్-రిఫండబుల్ కింద రూ.2లక్షలు కట్టాల్సి ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







