ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
- October 09, 2024
అమరావతి: కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, మద్యం షాపులు దక్కించుకోవాలనుకునే ఆశావహులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొత్త మద్యం దుకాణాల దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
టెండర్ల షెడ్యూల్ మార్పు కొరుతూ వివిధ జిల్లాల్లో ఉన్న దరఖాస్తుదారుల నుంచి భారీ ఎత్తున్న అభ్యర్థనలు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో సర్కార్ షెడ్యూల్ను మార్చింది.
ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. అలాగే 14న మద్యం షాపులకు లాటరీ విధానంలో డ్రా తీసి, 16 నుంచి దరఖాస్తుదారులకు దుకాణాలను కేటాయించడం జరుగుతుందని పేర్కొంది.
ఇదిలాఉంటే.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు గాను మంగళవారం రాత్రి వరకు 41,348 దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.826.96కోట్ల ఆదాయం వచ్చి చేరినట్లు సమాచారం. కాగా, ఒక్కొ దరఖాస్తుకు నాన్-రిఫండబుల్ కింద రూ.2లక్షలు కట్టాల్సి ఉన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్







