దుర్గమ్మ ను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- October 09, 2024
అమరావతి: దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్యతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు, అధికారులు స్వాగతం పలికారు. సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక జగన్మాత నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లలో ఉంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈరోజు టికెట్ దర్శనాలను నిలిపేసిన అధికారులు తెల్లవారుజాము నుంచి సర్వదర్శనం కల్పించారు. నేడు 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకోనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి