ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్
- October 10, 2024
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు ఉందంటూ థ్రెటెనింగ్ మెయిల్స్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే అలెర్ట్ అయి ఎయిర్పోర్ట్ మొత్తం బాంబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కోయంబత్తూరు – చెన్నై వయా హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
దాంతో హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు అధికారులు. ఆరు గంటలు చెక్ చేసిన తర్వాత ఏమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. ప్రయాణ సమయంలో ఇండిగో విమానంలో 181మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









