గుజరాత్ ముఖ్యమంత్రితో కువైట్ రాయబారి అల్-షెమాలి భేటీ..!!

- October 10, 2024 , by Maagulf
గుజరాత్ ముఖ్యమంత్రితో కువైట్ రాయబారి అల్-షెమాలి భేటీ..!!

కువైట్: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌ను కువైట్ రాయబారి మెషల్ అల్-షెమాలి మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఇండియా-కువైట్ సంబంధాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.  రాయబారి అల్-షెమాలి మాట్లాడుతూ.. తమ సమావేశంలో పరస్పర ఆసక్తి ఉన్న ఆహార భద్రత, సాంకేతిక రంగం, సమాచార అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలలో కువైట్-భారత్ బంధాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్లు తెలిపారు. అక్టోబరు 3 నుండి 11 మధ్య గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమంలో రాయబారి అల్-షెమాలి పాల్గొంటున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com