భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- October 18, 2024
యూఏఈ: భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మరింత మందికి ఆన్-అరైవల్ అందించనున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసిపి) ప్రకటించింది. ఇకపై యూకే, ఈయూ దేశాల పర్యాటక వీసాలు ఉన్న ఇండియన్స్ కు ఆన్ అరైవల్ వీసాలను అందించనున్నట్లు, ఈ మేరకు నిబంధనలలో మార్పులు చేసినట్టు అథారిటీ వెల్లడించింది. ఇప్పటివరకు అమెరికా పర్యాటక వీసాతోపాటు ఈయూ, యూకే దేశాల రెసిడెన్సీ ఉన్నవారికే ఆన్ అరైవల్ వీసాలను అందిస్తున్నారు.
యూఎస్, ఈయూ, యూకే వీసాలు, రెసిడెన్సీలు లేదా గ్రీన్ కార్డ్లను కలిగి ఉన్న భారతీయ పౌరులు వారి కుటుంబ సభ్యుల కోసం 14-రోజుల ప్రవేశ వీసా కోసం వీసా జారీ రుసుము Dh100గా నిర్ణయించారు. ఈ వీసాను అదనంగా 14 రోజులు పొడిగించడానికి రుసుము Dh250. 60 రోజుల వీసా 250 దిర్హాలు చెల్లించాలని ICP డైరెక్టర్ జనరల్ మేజర్-జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ తెలిపారు. భారతీయ పౌరులకు ఆన్-అరైవల్ వీసాను విస్తరించడం యూఏఈ-ఇండియా మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని అన్నారు. ఇది ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడతోపాటు పెట్టుబడులు, ప్రతిభావంతులను ఆకర్షిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









