భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- October 18, 2024
యూఏఈ: భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మరింత మందికి ఆన్-అరైవల్ అందించనున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసిపి) ప్రకటించింది. ఇకపై యూకే, ఈయూ దేశాల పర్యాటక వీసాలు ఉన్న ఇండియన్స్ కు ఆన్ అరైవల్ వీసాలను అందించనున్నట్లు, ఈ మేరకు నిబంధనలలో మార్పులు చేసినట్టు అథారిటీ వెల్లడించింది. ఇప్పటివరకు అమెరికా పర్యాటక వీసాతోపాటు ఈయూ, యూకే దేశాల రెసిడెన్సీ ఉన్నవారికే ఆన్ అరైవల్ వీసాలను అందిస్తున్నారు.
యూఎస్, ఈయూ, యూకే వీసాలు, రెసిడెన్సీలు లేదా గ్రీన్ కార్డ్లను కలిగి ఉన్న భారతీయ పౌరులు వారి కుటుంబ సభ్యుల కోసం 14-రోజుల ప్రవేశ వీసా కోసం వీసా జారీ రుసుము Dh100గా నిర్ణయించారు. ఈ వీసాను అదనంగా 14 రోజులు పొడిగించడానికి రుసుము Dh250. 60 రోజుల వీసా 250 దిర్హాలు చెల్లించాలని ICP డైరెక్టర్ జనరల్ మేజర్-జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ తెలిపారు. భారతీయ పౌరులకు ఆన్-అరైవల్ వీసాను విస్తరించడం యూఏఈ-ఇండియా మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని అన్నారు. ఇది ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడతోపాటు పెట్టుబడులు, ప్రతిభావంతులను ఆకర్షిస్తుందన్నారు.
తాజా వార్తలు
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ









