భారతీయులకు శుభవార్త చెప్పిన యూఏఈ..ఆన్-అరైవల్ విస్తరణ..!!
- October 18, 2024
యూఏఈ: భారతీయులకు యూఏఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై మరింత మందికి ఆన్-అరైవల్ అందించనున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసిపి) ప్రకటించింది. ఇకపై యూకే, ఈయూ దేశాల పర్యాటక వీసాలు ఉన్న ఇండియన్స్ కు ఆన్ అరైవల్ వీసాలను అందించనున్నట్లు, ఈ మేరకు నిబంధనలలో మార్పులు చేసినట్టు అథారిటీ వెల్లడించింది. ఇప్పటివరకు అమెరికా పర్యాటక వీసాతోపాటు ఈయూ, యూకే దేశాల రెసిడెన్సీ ఉన్నవారికే ఆన్ అరైవల్ వీసాలను అందిస్తున్నారు.
యూఎస్, ఈయూ, యూకే వీసాలు, రెసిడెన్సీలు లేదా గ్రీన్ కార్డ్లను కలిగి ఉన్న భారతీయ పౌరులు వారి కుటుంబ సభ్యుల కోసం 14-రోజుల ప్రవేశ వీసా కోసం వీసా జారీ రుసుము Dh100గా నిర్ణయించారు. ఈ వీసాను అదనంగా 14 రోజులు పొడిగించడానికి రుసుము Dh250. 60 రోజుల వీసా 250 దిర్హాలు చెల్లించాలని ICP డైరెక్టర్ జనరల్ మేజర్-జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ తెలిపారు. భారతీయ పౌరులకు ఆన్-అరైవల్ వీసాను విస్తరించడం యూఏఈ-ఇండియా మధ్య దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగమని అన్నారు. ఇది ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడతోపాటు పెట్టుబడులు, ప్రతిభావంతులను ఆకర్షిస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







