ఖతార్‌లోని ఐదు భారతీయ పాఠశాలల్లో డబుల్ షిఫ్ట్‌లకు అనుమతి..!!

- October 18, 2024 , by Maagulf
ఖతార్‌లోని ఐదు భారతీయ పాఠశాలల్లో డబుల్ షిఫ్ట్‌లకు అనుమతి..!!

దోహా: భారతీయ CBSE పాఠ్యాంశాలను అనుసరించే ఖతార్‌లోని కొన్ని పాఠశాలలు ప్రస్తుత విద్యా సంవత్సరం 2024-25 కోసం మధ్యాహ్నం బ్యాచ్‌ తో ప్రవేశాలతో డబుల్ షిఫ్ట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నాయి. ఇతర భారతీయ పాఠశాలల నుండి ఎటువంటి అంతర్గత బదిలీలు ఉండకూడదనే షరతుపై ఈ పాఠశాలలకు అనుమతి మంజూరు చేశారు. MES ఇండియన్ స్కూల్,  దోహా మోడ్రన్ ఇండియన్ స్కూల్ (DMIS)లో KG1 నుండి 8 వరకు మధ్యాహ్నం సెషన్ అడ్మిషన్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే MES-IS అబు హమూర్ బ్రాంచ్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్ (SIS),  ఐడియల్ ఇండియన్ స్కూల్ (IIS)లో I నుండి 8 తరగతులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. 

 రెండు క్యాంపస్‌లు మధ్యాహ్నం షిఫ్ట్‌లను ప్రారంభించడానికి విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందినట్లు MES ప్రిన్సిపాల్ హమీదా ఖాదర్ పెనిన్సులాకు ధృవీకరించారు. "ప్రస్తుత విద్యా సంవత్సరానికి, MES ఇండియన్ స్కూల్‌లో KG1 నుండి VIII తరగతి వరకు మంత్రిత్వ శాఖ మాకు అనుమతి ఇచ్చింది. అయితే మా MES-IS అబూ హమూర్ క్యాంపస్ I నుండి 8వ తరగతి వరకు విద్యార్థులను చేర్చుకుంటుంది.” అని పేర్కొన్నారు. అడ్మిషన్లు ప్రారంభమైన కొద్ది గంటల్లోనే అద్భుతమైన స్పందన లభించిందని, అడ్మిషన్ ఇంకా తెరిచి ఉన్నందున నంబర్ చెప్పలేనని ప్రిన్సిపాల్ చెప్పారు. నవంబర్ 3 నుండి తరగతులు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రారంభమవుతాయని తెలిపారు. మరోవైపు ఆసక్తిగల తల్లిదండ్రుల నుండి 4,000 దరఖాస్తులను స్వీకరించినట్లు SIS ప్రిన్సిపాల్ షేక్ షమీమ్ సాహెబ్ వెల్లడించారు. "ఇండియన్ స్కూల్‌లో మాత్రమే 4,800 మంది విద్యార్థులు అడ్మిషన్ కోసం వెయిటింగ్ లిస్ట్ కలిగి ఉన్నారు, అంటే అడ్మిషన్ల కోసం వెతుకుతున్న పిల్లలు ఉన్నారు. పాఠశాల ఇప్పుడు దాని క్యాంపస్‌లో సిబ్బందిని నియమించుకునే పనిలో ఉంది" అని షేక్ షమీమ్ సాహెబ్ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com