ఫుజైరా స్నూపీ ద్వీపం బీచ్ ఇప్పుడు సురక్షితం..!!
- October 19, 2024
యూఏఈ: ఎమిరేట్ తీరంలో ఉన్న స్నూపీ ద్వీపం బీచ్ ను తాకిన చమురు తెట్టును తొలగించారు. సందర్శకులు, అతిథులు ఈతకు వెళ్లడం ఇప్పుడు సురక్షితం అని అధికారులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్లో.. ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ క్లీన్-అప్ ఆపరేషన్కు ముందు, తరువాత బీచ్ ఫోటోలను షేర్ చేసింది. అత్యవసర బృందం కాల్కు వేగంగా స్పందించి బీచ్ కు వెళ్లిందన్నారు. ప్రత్యేక చమురు స్పిల్ రెస్పాన్స్ కంపెనీలు, ప్రభావిత హోటళ్లు, ఇతర సంస్థలతో సమన్వయంతో అధికార యంత్రాంగం క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. నిందితులను గుర్తించే దిశగా కృషి చేస్తున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి హాని కలిగించే వారిపట్ల ఎటువంటి ఉదాసీనత ఉండదని అథారిటీ తెలిపింది. ఏదైనా సమాచారాన్ని నివాసితులు ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ టోల్-ఫ్రీ నంబర్ 800368 ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







