ఫుజైరా స్నూపీ ద్వీపం బీచ్ ఇప్పుడు సురక్షితం..!!
- October 19, 2024
యూఏఈ: ఎమిరేట్ తీరంలో ఉన్న స్నూపీ ద్వీపం బీచ్ ను తాకిన చమురు తెట్టును తొలగించారు. సందర్శకులు, అతిథులు ఈతకు వెళ్లడం ఇప్పుడు సురక్షితం అని అధికారులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్లో.. ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ క్లీన్-అప్ ఆపరేషన్కు ముందు, తరువాత బీచ్ ఫోటోలను షేర్ చేసింది. అత్యవసర బృందం కాల్కు వేగంగా స్పందించి బీచ్ కు వెళ్లిందన్నారు. ప్రత్యేక చమురు స్పిల్ రెస్పాన్స్ కంపెనీలు, ప్రభావిత హోటళ్లు, ఇతర సంస్థలతో సమన్వయంతో అధికార యంత్రాంగం క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. నిందితులను గుర్తించే దిశగా కృషి చేస్తున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి హాని కలిగించే వారిపట్ల ఎటువంటి ఉదాసీనత ఉండదని అథారిటీ తెలిపింది. ఏదైనా సమాచారాన్ని నివాసితులు ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ టోల్-ఫ్రీ నంబర్ 800368 ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









