ఫుజైరా స్నూపీ ద్వీపం బీచ్ ఇప్పుడు సురక్షితం..!!
- October 19, 2024
యూఏఈ: ఎమిరేట్ తీరంలో ఉన్న స్నూపీ ద్వీపం బీచ్ ను తాకిన చమురు తెట్టును తొలగించారు. సందర్శకులు, అతిథులు ఈతకు వెళ్లడం ఇప్పుడు సురక్షితం అని అధికారులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్లోని ఒక పోస్ట్లో.. ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ క్లీన్-అప్ ఆపరేషన్కు ముందు, తరువాత బీచ్ ఫోటోలను షేర్ చేసింది. అత్యవసర బృందం కాల్కు వేగంగా స్పందించి బీచ్ కు వెళ్లిందన్నారు. ప్రత్యేక చమురు స్పిల్ రెస్పాన్స్ కంపెనీలు, ప్రభావిత హోటళ్లు, ఇతర సంస్థలతో సమన్వయంతో అధికార యంత్రాంగం క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. నిందితులను గుర్తించే దిశగా కృషి చేస్తున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పర్యావరణానికి హాని కలిగించే వారిపట్ల ఎటువంటి ఉదాసీనత ఉండదని అథారిటీ తెలిపింది. ఏదైనా సమాచారాన్ని నివాసితులు ఫుజైరా ఎన్విరాన్మెంటల్ అథారిటీ టోల్-ఫ్రీ నంబర్ 800368 ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







