వరల్డ్ సైట్ డే.. కంటి వ్యాధుల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు..!!
- October 21, 2024
దోహా: ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (IAPB) ప్రారంభించిన ‘వరల్డ్ సైట్ డే’ని పురస్కరించుకొని ఖతార్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) అనేక కార్యక్రమాలను చేపడుతోంది.కంటి వ్యాధులను నివారించడం, అలాగే దృష్టి లోపం లేదా అంధత్వానికి దారితీసే పరిస్థితులను ముందుగానే గుర్తించడం, నిర్ధారణ చేయడంపై అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.2 బిలియన్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య పెరగవచ్చని, 2050 నాటికి ప్రపంచ జనాభాలో సగం మందిపై ప్రభావం చూపవచ్చని ఐఏపీబీ హెచ్చరించింది.
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందించడానికి నిరంతరం కృషి చేయడంలో ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ హమద్ అల్ థానీ తెలిపారు. కంటి ఆరోగ్యం, సాధారణ కంటి వ్యాధులు, చికిత్స నివారణ పద్ధతులను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 2023లో ప్రకటించిన ఇటీవలి జాతీయ సర్వే ఫలితాల ప్రకారం.. 50 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులలో తీవ్రమైన దృష్టి లోపం లేదా అంధత్వంతో బాధపడుతున్న వారి శాతం గణనీయంగా తగ్గింది. 50 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 8.1% మంది దృష్టి లోపాన్ని ఎదుర్కొంటున్నారు. వీరిలో 0.2% మంది తీవ్రమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. అయితే అంధత్వంతో బాధపడుతున్న వారి శాతం 0.3% గా ఉంది. ఖతార్లో అంధత్వానికి ప్రధాన కారణాలను 33% డయాబెటిక్ రెటినోపతిగా సర్వేలో గుర్తించారు. ఆ తర్వాత స్థానాల్లో 20% కంటిశుక్లం, 13% వద్ద గ్లాకోమా, 13% వద్ద రెటీనా వ్యాధులు, 6.7% లో సైట్ సంబంధిత లోపాలు ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 40% మందికి డయాబెటిక్ ఉందని, వీరిలో 38% మంది వ్యక్తులు గత రెండేళ్లలో ఎటువంటి పరీక్ష చేయించుకోలేదని నివేదికల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







