ఒమన్ లో భారతీయ వ్యాపారవేత్తకు ఘనంగా నివాళులు..!!
- October 21, 2024
మస్కట్: సుర్ మార్కెట్లో ఇంటి గోడ కూలిన ఘటనలో మరణించిన భారతీయ వ్యాపారవేత్త పురుషోత్తమ్ భాటియా(89), అతని భార్య పద్మిని(85)లకు ఘరంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ జంట దశాబ్దాలుగా సూర్లో నివాసం ఉంటున్నారు. స్థానికులు 'వాల్ద్ హేరా' అని ముద్దుగా పిలుచుకునే పురుషోత్తమ్.. ప్రముఖ హీరానంద్ కిషందాస్ అండ్ కంపెనీని నడుపుతున్నారు. ఈ ప్రసిద్ధ వస్త్ర దుకాణం గత 70 సంవత్సరాలుగా సేవలందిస్తున్నది. విషాద వార్త వైరల్ కావడంతో.. అతని స్నేహితులు, బంధువులు, కస్టమర్లు ఆయన ఇంటి వద్ద నివాళులర్పిస్తున్నారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే సుర్ పర్యటన సందర్భంగా ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ ఆయనను సత్కరించారు. పురుషోత్తంకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







