ఒమన్ లో భారతీయ వ్యాపారవేత్తకు ఘనంగా నివాళులు..!!
- October 21, 2024
మస్కట్: సుర్ మార్కెట్లో ఇంటి గోడ కూలిన ఘటనలో మరణించిన భారతీయ వ్యాపారవేత్త పురుషోత్తమ్ భాటియా(89), అతని భార్య పద్మిని(85)లకు ఘరంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ జంట దశాబ్దాలుగా సూర్లో నివాసం ఉంటున్నారు. స్థానికులు 'వాల్ద్ హేరా' అని ముద్దుగా పిలుచుకునే పురుషోత్తమ్.. ప్రముఖ హీరానంద్ కిషందాస్ అండ్ కంపెనీని నడుపుతున్నారు. ఈ ప్రసిద్ధ వస్త్ర దుకాణం గత 70 సంవత్సరాలుగా సేవలందిస్తున్నది. విషాద వార్త వైరల్ కావడంతో.. అతని స్నేహితులు, బంధువులు, కస్టమర్లు ఆయన ఇంటి వద్ద నివాళులర్పిస్తున్నారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే సుర్ పర్యటన సందర్భంగా ఒమన్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ ఆయనను సత్కరించారు. పురుషోత్తంకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







