దుర్గమ్మకు దసరా భక్తుల కానుకల వెల్లువ !
- October 22, 2024
విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇటీవల నిర్వహించిన దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఆలయాల్లో అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి నగదు బంగారం వెండితో పాటు విదేశీ డాలర్లను కనుక సమర్పించారు.
అధికారులు భక్తుల సమర్పించిన హుండీల లెక్కింపును ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులు నిర్వహించారు. ఇప్పటికే రెండు దఫాలుగా హుండీ లెక్కింపు నిర్వహించగా సోమవారం మూడో రోజు పలు హుండీలను లెక్కించారు.
కాగా, సోమవారం హుండీ లెక్కింపు సందర్భంగా… నగదు రూ. 3,05,96,971/- లు అమ్మవారికి భక్తులు నగదు రూపంలో కానుకలు చెల్లించుకున్నారు. కానుకల రూపములో బంగారం 321 గ్రాములు, వెండి 9 కేజీల 882 గ్రాములు అమ్మవారికి కానుకల రూపంలో వచ్చాయి. విదేశీ కరెన్సీ లో యూఎస్ఏ-168 డాలర్లు, ఆస్ట్రెలియా 55 డాలర్లు, కువైట్-41.5 దినార్లు, ఖతార్-27 రియాల్స్, యూఏఈ-5 దిర్హాములు, మలేషియా-10 రింగేట్లు, సౌదీ-100 రియాల్స్ ను భక్తులు అమ్మవారికి కానుకగా సమర్పించారు.
మొత్తం మూడు రోజుల హుండీ లెక్కింపు కలిపి నగదు రూ.9,26,97,047/- లు, కానుకల రూపములో బంగారం 733 గ్రాములు, వెండి 25 కేజీల 705 గ్రాములు అమ్మవారికి కానుకలుగా వచ్చాయి. వీటితో పాటు విదేశీ డాలర్లు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. సోమవారం నిర్వహించిన హుండీ లెక్కింపు లో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో రత్న రాజు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు, ఆలయ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!