సౌదీలో కొత్తగా సముద్ర పర్యావరణ చట్టాలు..10 ఏళ్ల జైలు, SR30 మిలియన్ జరిమానా..!!
- October 23, 2024
రియాద్: సౌదీ అరేబియాలో సముద్ర పర్యావరణ చట్టాలకు పదును పెట్టారు. ఇకపై పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. కొత్త పర్యావరణ చట్టం ప్రకారం, ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, SR30 మిలియన్ల వరకు జరిమానాలు ఉన్నాయి. సముద్ర ప్రాంతాలు, నీటి వనరులను రక్షించడానికి.. అలాగే సముద్ర ప్రాంతాలను సంరక్షించడానికి ఉద్దేశించిన నిర్దిష్ట నిబంధనలు చట్టంలో ఉన్నాయి. రసాయనాలు లేదా వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యం వంటి వాటిని నీటి వనరులకు హాని కలిగించే పర్యావరణ నేరాల కింద చేర్చారు. నేరం తీవ్రతను బట్టి SR1 మిలియన్ నుండి SR30 మిలియన్ల వరకు జరిమానాలు విధించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని, చట్టాలను ఉల్లంఘించిన సందర్భంలో వ్యక్తులు, సంస్థలపై జరిమానాలు ఒకే విధంగా విధించబడతాయని హెచ్చరించారు. అయితే, పర్యావరణ పరిరక్షణకు కొత్త చట్టాన్ని తేవడం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







