బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగం
- October 23, 2024
మాస్కో: భారత్ యుద్ధానికి మద్దతు ఇవ్వదని.. చర్చలు, దౌత్యానికి మాత్రమే మద్దతు ఇస్తుందని బ్రిక్స్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యాలో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సుకు వచ్చిన దేశాల అధినేతలతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు.
అన్ని వివాదాలు చర్చలతో పరిష్కృతమవుతాయని మోదీ అన్నారు. రష్యాలోని కెసాన్ నగరంలో బ్రిక్స్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చినందుకు, గత ఏడాదిగా కూటమికి నాయకత్వం వహించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు కూడా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో బ్రిక్స్ సమావేశం జరుగుతోందని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నిరోధించడం, ఆహారం, విద్యుత్తు, ఆరోగ్యానికి భరోసా, నీటి భద్రత, ఆన్లైన్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, డీప్ఫేక్ల వంటి సైబర్ మోసాలు వంటి ప్రపంచంలో కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయని చెప్పారు.
ప్రపంచం ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ బ్రిక్స్ దేశాల సమూహంపై ప్రపంచానికి అనేక అంచనాలు ఉన్నాయని అన్నారు. బ్రిక్స్ అన్ని రంగాలలోనూ సానుకూల పాత్ర పోషించగలదని తాను నమ్ముతున్నానని మోదీ చెప్పారు.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!