నవంబర్ నెలాఖరులోగా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ
- October 26, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదా నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన సూచనల ప్రకారం, ఈ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలని, విస్తృత అధ్యయనం, నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు చేయాలని తెలిపారు.
ముఖ్యమంత్రి తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో, రాష్ట్రంలో ఉన్న క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు త్వరగా రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (YISA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) సంబంధించి పలు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో గుర్తించిన అంశాలను కూడా ఈ పాలసీలో చేర్చాలని సూచించారు.
మరో పది రోజుల్లో స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్ను వెంటనే తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో నేషనల్ గేమ్స్కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ను సంప్రదించాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, ముఖ్యమంత్రి కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







