నవంబర్ నెలాఖరులోగా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ
- October 26, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదా నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన సూచనల ప్రకారం, ఈ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలని, విస్తృత అధ్యయనం, నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు చేయాలని తెలిపారు.
ముఖ్యమంత్రి తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో, రాష్ట్రంలో ఉన్న క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు త్వరగా రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (YISA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) సంబంధించి పలు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో గుర్తించిన అంశాలను కూడా ఈ పాలసీలో చేర్చాలని సూచించారు.
మరో పది రోజుల్లో స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్ను వెంటనే తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో నేషనల్ గేమ్స్కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ను సంప్రదించాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, ముఖ్యమంత్రి కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







