రమదాన్ మాసం లో కూడా మద్యం లభ్యం
- June 23, 2016
పవిత్ర రమదాన్ మాసంలో తమ దేశానికి వచ్చే టూరిస్టులకు నోరూరించే వార్త చెప్పింది దుబాయ్ టూరిజం డిపార్ట్మెంట్. చరిత్రలో తొలిసారిగా మద్యం అమ్మకాలపై ఉన్న నిబంధనలను సడలించింది. రమదాన్ మాసం ముగిసేవరకు పగలు కూడా మద్యం అమ్ముకోవచ్చని దేశంలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతిచ్చింది. టూరిస్టులు, ఆల్కహాల్ ట్యాక్స్ తమ ఆదాయాన్ని భారీస్థాయిలో పెంచుతారని ఆశిస్తున్న అక్కడి టూరిజం డిపార్ట్మెంట్ విచ్చలవిడి మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపింది. గతంలో ఎవరైనా మద్యం సేవించాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ నెల రోజులు మాత్రం ఎప్పుడుపడితే అప్పుడు మందు అందుబాటులో ఉండనుంది.
అయితే పవిత్ర రమదాన్ మాసంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మసలుకోవాలని పర్యాటకులకు సూచించింది. రమదాన్ మాసం ముగిసేవరకు కనీసం పది లక్షల మంది టూరిస్టులు దుబాయ్ వస్తారని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. తమ పక్కనే ఉన్న సౌదీఅరేబియా, కువైట్, షార్జాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండగా.. దుబాయ్లో మాత్రం ఉన్న నిబంధనలను కూడా సవరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీర్పై 30 శాతం మున్సిపాలిటీ ట్యాక్స్, మద్యంపై 50 శాతం దిగుమతి పన్నులాంటివి ఉండటంతో వీటి అమ్మకాలను పెంచడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని దుబాయ్ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









