రమదాన్ మాసం లో కూడా మద్యం లభ్యం
- June 23, 2016
పవిత్ర రమదాన్ మాసంలో తమ దేశానికి వచ్చే టూరిస్టులకు నోరూరించే వార్త చెప్పింది దుబాయ్ టూరిజం డిపార్ట్మెంట్. చరిత్రలో తొలిసారిగా మద్యం అమ్మకాలపై ఉన్న నిబంధనలను సడలించింది. రమదాన్ మాసం ముగిసేవరకు పగలు కూడా మద్యం అమ్ముకోవచ్చని దేశంలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లకు అనుమతిచ్చింది. టూరిస్టులు, ఆల్కహాల్ ట్యాక్స్ తమ ఆదాయాన్ని భారీస్థాయిలో పెంచుతారని ఆశిస్తున్న అక్కడి టూరిజం డిపార్ట్మెంట్ విచ్చలవిడి మద్యం అమ్మకాలకు పచ్చజెండా ఊపింది. గతంలో ఎవరైనా మద్యం సేవించాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిన పరిస్థితి ఉండేది. అయితే ఈ నెల రోజులు మాత్రం ఎప్పుడుపడితే అప్పుడు మందు అందుబాటులో ఉండనుంది.
అయితే పవిత్ర రమదాన్ మాసంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మసలుకోవాలని పర్యాటకులకు సూచించింది. రమదాన్ మాసం ముగిసేవరకు కనీసం పది లక్షల మంది టూరిస్టులు దుబాయ్ వస్తారని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. తమ పక్కనే ఉన్న సౌదీఅరేబియా, కువైట్, షార్జాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండగా.. దుబాయ్లో మాత్రం ఉన్న నిబంధనలను కూడా సవరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీర్పై 30 శాతం మున్సిపాలిటీ ట్యాక్స్, మద్యంపై 50 శాతం దిగుమతి పన్నులాంటివి ఉండటంతో వీటి అమ్మకాలను పెంచడం ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకోవాలని దుబాయ్ భావిస్తోంది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







