సుల్తాన్ కబూస్ మంచి ఆరోగ్యంతో ఉన్నారు : ఒమాని ఆరోగ్య మంత్రి
- June 23, 2016
మస్క్యాట్: ఒమన్ యొక్క సుల్తాన్ కబూస్ బిన్ సయీద్ మంచి ఆరోగ్యంతో ఉన్నారని ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్ సైది మంగళవారం తెలిపారు. సుల్తాన్ గత ఏప్రిల్లో మస్కట్ మంత్రిమండలి సమావేశంకు అధ్యక్షత వహించిన తర్వాత క్రమానుగుణంగా వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం రెండు నెలల తరువాత ఆయన తన మంచి ఆరోగ్య ఆధారాలతో ఉన్నట్లు అల్ సైది చెప్పారు.
సుల్తాన్ కబూస్ తన వైద్య సిబ్బందితో సహా వైద్య చికిత్స కోసం జర్మనీకి వెళ్లిన సందర్భాన్ని అల్ సైది గుర్తు చేశారు. ఓమాని వైద్య సిబ్బంది కొన్నిసార్లు చికిత్స కొన్ని అంశాలపై విదేశీ వైద్య సిబ్బందిని అధిగమించారని అల్ సైది అన్నారు. మంగళవారం బ్యాంక్ మస్కట్ ఏర్పాటు చేసిన ఆతిధ్య బహిరంగ సమావేశంలో మంత్రి మాట్లాడారు.
సుల్తాన్ కబూస్ జర్మనీ నుండి రెండు నెలల తర్వాత ఆవర్తక వైద్య పరీక్షలు చేయించుకున్న నేపథ్యంలో ఏప్రిల్ 12 న మస్క్యాట్ తిరిగి వచ్చారు .సామాజిక మాధ్యమాలు సుల్తాన్ యొక్క తిరిగి వచ్చేరని వార్తలను ఆనవాయితీగా ఇచ్చారు . నేషనల్స్ "ట్విట్టర్ లో " సంతోషంగా ఉండండి....కబూస్ తిరిగి వచ్చేరు " " సంతోషంగా ఉండండి! కబూస్ వచ్చారు " నవ్వుతూ ఉండండి మరియు మా ప్రార్థనలు ఆయన రక్షణ కోసం తదితర అనుకూలంగా సిఫార్సు " చేసింది.
సుల్తాన్ కబూస్ జూలై 2014 లో జర్మనీ లో ఒక ఎనిమిది నెలల వైద్య చికిత్స చేయించుకున్న అతను 2015 మార్చిలో దేశంకు తిరిగి వచ్చేరు. నవంబర్, 2014 లో సుల్తాన్ కబూస్ అతని ఆరోగ్యం గురించి పౌరులు ఒక వీడియో లో ఆయన జర్మనీలో వైద్య చికిత్స.పొందుతున్నారని హామీ ఇచ్చారు
రాష్ట్ర వార్తలు ఛానల్ ఒమన్ టీవీలో నిర్వహించిన ఒక వీడియోలో సుల్తాన్ 44 వ జాతీయ దినోత్సవం రోజున నవంబర్ 18 న దేశ పౌరులకు ఆయన శుభాకాంక్షలు పలికారు, మరియు తాను ఆ ఉత్సవాల్లో పాల్గొన లేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







