మ్యాచ్లో ఘర్షణ.. ముగ్గురు ఫుట్బాల్ ఆటగాళ్లకు జైలుశిక్ష, Dh600,000 జరిమానా..!!
- October 30, 2024
యూఏఈ: అబుదాబిలో అక్టోబర్ 20న జరిగిన మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లో ఘర్షణకు పాల్పడిన ఈజిప్షియన్ జమాలెక్ క్లబ్కు చెందిన ముగ్గురు ఫుట్బాల్ ఆటగాళ్లకు ఒక నెల జైలు శిక్ష, ఒక్కొక్కరికి Dh200,000 జరిమానా విధించారు.
పిరమిడ్స్ క్లబ్తో జరిగిన ఈజిప్షియన్ సూపర్ కప్ సెమీ-ఫైనల్లో ఒక మ్యాచ్లో పబ్లిక్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడం, అల్లర్లను ప్రేరేపించినందుకు వారిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. జమాలెక్ క్లబ్ అల్ అహ్లీ క్లబ్తో పాటు ఈజిప్ట్లోని రెండు అత్యంత ప్రజాదరణ పొందిన క్లబ్లలో ఒకటి.
ఘటన అనంతరం అక్టోబరు 21న నబిల్ ఎమాద్ డొంఘా, ముస్తఫా షాలబీ, ఫుట్బాల్ డైరెక్టర్ అబ్దెల్ వాహెద్ ఎల్ సయ్యద్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితులపై అభియోగాలు రుజువయ్యాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో సీసీ ఫుటేజీ ద్వారా సాక్ష్యాధారాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్లేయర్స్ నిబంధనలను పాటించలేదని, క్రీడా ఈవెంట్ను సురక్షితంగా ఉంచడానికి బాధ్యత వహించే ప్రభుత్వ ఉద్యోగులపై అనవరసరంగా దాడికి పాల్పడ్డారని తన తీర్పులో కోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









