అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్దేవ్
- October 30, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కలిశారు. బుధువారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కు చేరుకున్న బాబా..చంద్రబాబు ను కలిశారు. ఈ సమావేశంలో బాబా రామ్దేవ్, చంద్రబాబు రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం పై చర్చించారు.
బాబా రామ్దేవ్, యోగా గురువు, వ్యాపారవేత్త మరియు పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయుర్వేదం, యోగా, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో రామ్దేవ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేద ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులను విస్తరించి, దేశవ్యాప్తంగా ప్రజలకు అందిస్తున్నారు.
తన జీవితంలోని తొలినాళ్ల నుంచి యోగా మరియు ఆరోగ్యకర జీవన విధానంపై దృష్టి పెట్టిన రామ్దేవ్, అనేక యోగా శిబిరాలు నిర్వహించి, ప్రజలకు యోగా నేర్పడంలో ముందుంటారు. ఆయుర్వేదం, యోగా ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ, ఆయన ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం లక్షల మందిని ప్రేరేపించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







